Heavy Rain in Choutuppal Market Yard : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అమ్ముకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో సుమారు 148 మంది రైతులకు చెందిన 15 వేల ధాన్యం బస్తాలు నిల్వ ఉన్నాయి.