¡Sorpréndeme!

వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

2025-04-13 11 Dailymotion

Police Have Cracked Sensational Murder Case Of Businessman : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో మార్చి 26వ తేదీన జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం, పోలవరం మండలం పెద్దవం గ్రామంలో సచివాలయ సర్వేయర్​గా చేస్తున్న శ్రీనివాస్ అదే ప్రాతంలో ఉంటున్న వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ వద్ద గత ఏడాది డిసెంబర్​లో రూ. 24,0000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చాలని కొంతకాలంగా వ్యాపారి శ్రీనివాస్​పై ఒత్తిడి తెచ్చాడు. అయితే బెట్టింగులు, తదితర వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా ప్రభాకర్​ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అప్పు తీర్చవలసిన అవసరం లేదని భావించాడు.