Woman Suspicious Death in Vidavalur : వరకట్న నిషేధ చట్టం ప్రకారం భారతదేశంలో పెళ్లి సమయంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే! కానీ, ఇది మాటలకు, పుస్తకాలకే పరిమితమవుతోంది. పేద, మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకూ అందరూ ఎవరి స్థాయికి తగ్గినట్టు వాళ్లు వివాహమప్పుడు వరుడికి కట్నకానుకలు, భూమి వంటివి సమర్పించడం సర్వసాధారమైపోయింది. అయితే కొంతమంది పెండ్లి తర్వాత కూడా అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటనలు కోకొళ్లలు. అవి అంతటితో ఆగకుండా, నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది.