Police Solved Major Theft Case Within 24 Hours : బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడి నుంచి 55 లక్షల 50 వేల రూపాయలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న ఇంకొల్లులోని వ్యాపారి జాగర్లమూడి శివప్రసాద్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. నిందితుడు బీరువా తాళాలు పగులగొట్టి రూ.55లక్షల 50 వేల నగదు, 20 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు 24 గంటల్లో దొంగను పట్టుకున్నారు.