Hydra Demolitions In Quthbullapur : హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో పట్టా కలిగిన తమ భూములలోని ప్రహారీ గోడను హైడ్రా అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సురారం గ్రామంలో ఓ సర్వే నంబర్ ప్రకారం తాము 2009వ సంవత్సరంలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రైవేట్ భూమి కాదంటూ ఇది ప్రభుత్వ భూమి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేశారని వారాల రాజేశ్వర్ రావు అనే వ్యక్తి ఆరోపించారు. హైడ్రా పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని బాధితుడు రాజేశ్వర్ పేర్కొన్నారు.