రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మహ్మద్ అబ్దుల్ అస్లాం పథకం ప్రకారమే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడడని పహాడీ షరీఫ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు 2018 లో పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు.