రాజధాని అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా వెంకటపాలెం టీటీడీ ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాజధాని గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.