¡Sorpréndeme!

స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం - సభ వాయిదా - TELANGANA ASSEMBLY ADJOURNED

2025-03-13 1 Dailymotion

Telangana Budget Session : స్పీకర్​ను ఉద్దేశించి బీఆర్​ఎస్​ నేత జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సభ్యులు అభ్యంతరం తెలపడంతో అటువైపు నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సైతం వాదనలకు దిగారు. దీంతో శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ సభను వాయిదా వేశారు. ఉభయసభల్లో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చేయడానికి ఇవాళ సభ రెండో రోజు ప్రారంభమైంది. శాసనసభ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే వాయిదా పడింది.

అసలు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడారో చూద్దాం.'ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీశ్​రెడ్డి అన్నారు. మా అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్​గా మీరు కూర్చొన్నారు. అంతేగానీ ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో నా విషయంలోనే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారని స్పీకర్​ తెలిపారు. దీంతో స్పీకర్​నుద్దేశించి జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.