¡Sorpréndeme!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తి - ఎవరు గెలిచారంటే?

2025-03-06 1 Dailymotion

Graduate MLC Election : ఎంతో ఉత్కంఠ రేపిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీ పోరులో కాంగ్రెస్​ అభ్యర్థి నరేందర్​ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలగా కాంగ్రెస్​ సిటింగ్​ సీటును కోల్పోయింది.

ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది బరిలో నిలవగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోరు నడిచింది. మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా, గత నెల 27న జరిగిన పోలింగ్​లో 2,52,029 మంది ఓటేశారు. ఆ ఓట్లలలో 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు.