TTD BOARD MEMBER ISSUE SOLVED: టీటీడీ ఉద్యోగులు, బోర్డు సభ్యుడి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్యామలరావు చోరవతో సమావేశమైన ఉద్యోగులు, బోర్డు సభ్యులు పరస్పరం చర్చించుకున్నారు. మహాద్వారం గేటు వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ను దూషించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పారు. ఘటన దురదృష్టకరమని, ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించుకున్నామని బోర్డు సభ్యులు తెలిపారు.