¡Sorpréndeme!

జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకం

2025-02-18 0 Dailymotion

Minister Nimmala Presentation at Udaipur Conference in Rajasthan : జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు. 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్ వే నిర్మించినట్టు స్పష్టం చేసారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సదస్సుకు నిమ్మల హాజరై ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. డెల్టాల స్థిరీకరణకు, సుస్థిర సాగుకు పోలవరం అత్యంత కీలకమని చెప్పారు.