Margadarsi Chit Fund 122nd Branch Opened in Karnataka : ప్రజల ఆర్థిక అవసరాలకు ఆలంభనగా నిలుస్తూ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో చందాదారుల అభిమానం చూరగొంటున్న మార్గదర్శి చిట్ఫండ్ తన 122వ శాఖను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రారంభించింది.శైలజా కిరణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఖాతాదారులకు రసీదు అందజేశారు. చిత్రదుర్గలో నూతనశాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. మార్గదర్శిపై తమకు ఉన్న నమ్మకాన్ని వివరించారు. మరో ఐదారు శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్స్ కర్ణాటక విభాగం డైరెక్టర్ లక్ష్మణరావు, మార్గదర్శి ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.