Governor Abdul Nazeer Republic Day Speech 2025 : రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటక, సెర్ప్, గృహనిర్మాణ శాఖ , పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శకటాలు ఆకట్టుకున్నాయి.