Man Suicide Attempt in Grama Sabha in Mulugu : ఇందిరమ్మ ఇళ్లు లిస్టులో తమ పేరు రాకపోవడంతో మనస్తాపానికి చెందిన వ్యక్తి గ్రామసభలోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. అక్కడకు కొత్తూరు గ్రామానికి చెందిన నాగేశ్వర రావు గ్రామసభకు హాజరయ్యారు. అయితే ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులు పేర్లు చెక్ చేయగా నాగేశ్వర రావు కుటుంబానికి రాలేదు.