CM Chandrababu Speech in Visakha Public Meeting: మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.08 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖ వాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వస్తోందని తెలిపారు. రూ.2.08 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.