Pension Distribution in AP : ఏపీలో ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో 63,77,943 మందికి గాను రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31నే ఈ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పెన్షన్ డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే దీనిని చేపట్టారు. 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఉదయం 10 గంటలకు సమయానికి 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు.