ADB Approves Funding for Amaravati: అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతికి 8వేల కోట్ల నిధులిచ్చేందుకు ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఇక ప్రపంచ బ్యాంక్ ఆమోదం లాంఛనం కానుంది. ఈమేరకు తొలివిడతగా జనవరిలో 3 వేల 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం, నిధులు అందగానే పనులను పరుగులు పెట్టించేందుకు సర్వం సిద్ధం చేసింది.