¡Sorpréndeme!

కెంగేరిలో మార్గదర్శి చిట్​ఫండ్​​ 119వ బ్రాంచ్​ ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

2024-12-11 12 Dailymotion

Margadarshi 119 Branch Open : విశ్వసనీయతకు మారుపేరు.. నమ్మకానికి అమ్మ వంటి మార్గదర్శి చిట్​ఫండ్​ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ తన 119వ బ్రాంచ్​ను కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభించింది. బెంగళూరులోని కెంగేరిలో మార్గదర్శి చిట్​ఫండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజా కిరణ్​ బ్రాంచ్​ను ప్రారంభించారు. ముందుగా రిబ్బన్​ కట్​ చేసి.. పూజలు చేశారు. అనంతరం ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. బ్రాంచ్​ మొదటి కస్టమర్​ నుంచి చిట్​ కట్టించుకున్నారు. బ్రాంచ్​లో ఉద్యోగులతో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ సరదాగా గడిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త శాఖలు ప్రారంభించనున్న సందర్భంగా మార్గదర్శి చిట్​ఫండ్​ ఎండీ​ శైలజా కిరణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.