Telangana Samagra Kutumba Survey : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రెండో దశ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిన్న(శనివారం) మందకొడిగా ప్రారంభమైంది. 29 లక్షల ఇళ్లకు గాను తొలి దశలో మూడు రోజుల నుంచి 22 లక్షలకుపైగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టిక్కరింగ్ పూర్తి కాకపోవడం, సిబ్బంది ఓటరు నమోదు కార్యక్రమంలో ఉండటంతో మధ్యాహ్నం తర్వాత సర్వే మొదలుపెట్టారు. అయితే చాలా సర్కిళ్లలోని ఎన్యుమరేటర్లకు సర్వే ఫారాలు అందలేదు. కేటాయించిన 150 ఇళ్లను పూర్తి చేసిన వారికే సర్వే ఫారాలు ఇస్తున్నారని పలువురు ఎన్యుమరేటర్లు తెలిపారు. మరోవైపు స్టిక్కర్లు అతికించే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దుర్భాషలాడుతూ సర్వేకు సహకరించడం లేదని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు.