Huge Traffic in Hyderabad-Vijayawada National Highway : దీపావళి పండక్కి ఊర్లకి వెళ్లిన వారంతా ఆదివారం సాయంత్రం నగరం బాట పట్టడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికుల వాహనాలతో రద్దీగా మారింది. నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. నల్గొండ, ఖమ్మం, నార్కట్పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తునట్లు తెలుస్తుంది.