ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.ఈ క్రమంలోనే దుర్గమ్మను దర్శించేకునేందుకు మంత్రులు ఏపీ మంత్రులు వచ్చారు. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.