Ministers to Meet Party Workers at Gandhi Bhavan : పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దులుగా నడిపేందుకు కాంగ్రెస్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్ రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సిబ్బందిని ఆదేశించారు. గాంధీభవన్లో మంత్రులు ప్రజావాణి తరహాలో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.