Munneru River Flood Victims 2024 : మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాపదికన సహాయచర్యలు సాగిస్తోంది. అంటురోగాలు జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ స్వచ్చందసంస్థలు, రాజకీయ పార్టీల నేతలు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.