Harish Rao Slams Congress Govt Over Floods : ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాధితులకు కనీసం ఆహారం, మంచినీటి సరఫరా కూడా లేదని, ఆకలితో అలమటిస్తున్నారని వాపోయారు. వరదల్లో సర్వం కోల్పోయి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారని, కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా, పరామర్శించేందుకు వచ్చిన తమపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు.