Police Help Victims in Flood Areas : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల్లో పోలీసులు పెద్దఎత్తున సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. రైళ్లు, వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులతో పాటు పలువురిని కాపాడారు. ప్రయాణికులకు ఆహారం, తాగు నీటి సౌకర్యం కల్పించారు. సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను ఆదుకున్న వారిని డీజీపీ జితేందర్ అభినందించారు.