Chandrababu Visit Vijayawada : విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. సింగ్నగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడొద్దని వారికి హామీ ఇచ్చారు.