Cleanliness and Greening Programin Telangana : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టనున్నారు. ఐదు రోజులు పాటు సాగేలా వివిధ ప్రణాళికలతో పాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ములుగు జిల్లాలోని అబ్బాపురంలో మంత్రి సీతక్క స్వచ్ఛదనం-పచ్చదనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు