ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి, అక్రమాలు అనంతం. టీడీఆర్ బాండ్ల జారీలో తీగ లాగితే డొంక కదిలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో గత సర్కార్లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు రూ.2,000ల కోట్లు వరకు కమీషన్ల రూపేణ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.