Cyber Crime in Nizamabad : కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపారు నేరగాళ్లు. ఈ నేరాల పట్ల అవగాహన పెరిగినందున రోజుకో మార్గంలో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల పేరిట వాట్సాప్ క్రియేట్ చేసి, ప్రజలకు కాల్స్ చేసి ఫలనా మీ అబ్బాయి, అమ్మాయి ఫలానా కేసులో ఇరుక్కుందంటూ చెప్పి డబ్బులు లాగుతున్నారు. పోలీస్ అధికారుల ఫొటోతో కాల్ రావడంతో ఆందోళనకు గురువుతున్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకతనికి ఎదురైంది. దీంతో నిందితులకు ప్రశ్నల వర్షం కురిపించగా ఏకంగా కాల్ కట్ చేశారు.