Telangana Fire department passing out parade in Hyderabad : తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.