Heavy Rains in Nizamabad District : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్లోని చెరువులు, వాగులు వంకలు నిండు కుండలా మారాయి. భీమ్గల్ మండలంలోని కప్పలవాగు చెక్ డ్యామ్ పూర్తిగా నిండి వరద నీరు కిందికి ఉరకలెత్తుతోంది. దీంతో పలు పంటపొలాల్లోకి నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. కాగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారి వర్షం ధాటికి కోతకు గురైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, చెరువులవైపు వెళ్లొద్దని హెచ్చరించారు.