Godavari Water Level Increased : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి 31.5 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాళ్లిపేరు, కాలేశ్వరం సమ్మక్క సారక్క బ్యారెజీల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరిగిన వరద వల్ల గోదావరి నీటిమట్టం భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది.