Congress Leaders Meeting Started at Praja Bhavan : ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం(రేపు) సాయంత్రం 4 గంటలకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి వెళుతుందన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షించారు.