Kishan Reddy On Lok Sabha Election Result : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో, ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ బీజేపీ జెండా ఎగిరిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది.