CM Chandrababu inspected Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుందన్న ఆయన, రాష్ట్రంలోనూ మరో ఐదు ఎయిర్పోర్టులు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.