తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ ఇష్యూ తర్వాత దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఎవరూ ఊహించని పలువురి పేర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా #మీటూ ఉద్యమంలో స్క్రీన్ రైటర్, నిర్మాత, డైరెక్టర్ వినితా నందా చేరారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో భారీ లేఖను పోస్టు చేశారు. 20 ఏళ్ల క్రితం ప్రముఖ టీవీ నటుడు తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో 'సంస్కారి' ఇమేజ్ ఉన్న ప్రముఖ నటుడు అలోక్ నాథ్ మీద ఆమె ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
#VintaNanda
#sanskaari
#AlokNath
#MeToo