హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం అంత్యక్రియలు ముగియడంతో నెక్ట్స్ జరుగాల్సిన కార్యక్రమాలపై ఫ్యామిలీ మెంబర్స్ దృష్టి పెట్టారు. హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ కలిసి ఇందుకు సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏమేం కార్యక్రమాలు నిర్వహించాలనే విషయాలను బాలయ్య స్వయంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.