YSRCP Leader Bosta Satyanarayana Slams Chandrababu over Union Budget 2018
కేంద్ర బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
చంద్రబాబూ.. మీ డ్రామాలు ఇక కట్టిపెట్టండి. ప్రజలను మోసం చేయడం ఆపండి. వచ్చే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని బొత్స అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్ ఏపీ ప్రజల కోరిక. వాటి కోసం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు పోరాడటం లేదు. భారత చరిత్రలో చంద్రబాబుది చేతకాని ప్రభుత్వం అందుకే బడ్జెట్ కేటాయింపులో ఎక్కడా ఏపీ ఊసే లేదు.’ అని బొత్స అన్నారు